Wednesday, April 24, 2024

జీవో నెంబ‌ర్ 1 గురించి ఆందోళ‌న వ‌ద్దు.. ఏపీ డీజీపీ

జీవో నెంబ‌ర్ 1 గురించి ఎలాంటి ఆందోళ‌న వ‌ద్ద‌ని ఏపీ డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్.1 పై విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో డీజీపీ స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలీసుల జిల్లా రివ్యూ మీటింగ్ కు డీజీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ఈ జీవోతో ఎవరి కార్యక్రమాలను అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇచ్చామన్నారు. ఎవరైనా పాదయాత్రలు చేయాలనుకుంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని సూచించారు. జీవో వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ పార్టీల మీటింగులకు అనుమతులు ఇచ్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement