Friday, April 19, 2024

గజపతులంటే నిజాం నవాబులకు బానిసలు: అశోక్ గజపతిపై విజయసాయి

మాన్సాస్, సింహాచలం దేవస్థానం ట్రస్టులకు చైర్మన్ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం గజపతిరాజుల చరిత్రను ప్రస్తావిస్తూ అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేశారు. ‘’ తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక. ఫ్రెంచ్, బ్రిటీష్ సేనలను, పొరుగు రాజ్యం కుట్రలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారు. గానీ విజయరామ గజపతిలా విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదు వారు. హైదర్ జంగ్, బుస్సీ దొరకు లంచం ఇచ్చి బొబ్బిలి కోటపై దొంగదెబ్బ కొట్టాడు విజయరామ గజపతి. తండ్రి పీవీజీ రాజులా కాకుండా ముత్తాత విజయరామలా మారాడు అశోక్. చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడు.

కానీ నీ ఆటలు ఇక సాగవు అశోక్. ఇది 18వ శతాబ్దం కాదు. గజపతులంటే ఎన్నడూ ప్రజల పక్షాన నిలబడని మోతుబరి జమిందారులు. గోల్కొండ సుల్తానులకు, నిజాం నవాబులకు బానిసలు. ఫ్రెంచ్ జనరల్ బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బతీశారు. ప్రజలను పీడించి, బ్రిటీష్ వారికి కప్పం కట్టేవారు గజపతులు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వాళ్లతో కలిసి ప్రజలను హింసించారు. ఈ నేపథ్యంలో పీవీజీ, ఆనంద గజపతిని కాదని పాత వారసత్వాన్నే కొనసాగిస్తున్నావా అశోక్? కప్పం చంద్రబాబుకు కడుతున్నావా… పప్పునాయుడుకా? ఎన్టీఆర్ కు వెన్నుపోటుకు మీ పూర్వీకులే స్ఫూర్తా?” అంటూ విజయసాయి విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి: ఆవేదన తో వచ్చా…ప్రశ్నిస్తాం !! ప్రకాష్ రాజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement