Thursday, March 28, 2024

ఏపీలో కొత్తగా 1,167 మందికి కరోనా

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 55,307 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,167 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 224, చిత్తూరు జిల్లాలో 167, నెల్లూరు జిల్లాలో 141, ప్రకాశం జిల్లాలో 130 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు గుర్తించారు.

అదే సమయంలో 1,487 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,45,657 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,18,324 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,208 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 14,125కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement