Thursday, March 28, 2024

ఎమ్మెల్సీ కారులో మృత‌దేహం.. డ్రైవ‌ర్‌ని చంపేశారా? యాక్సిడెంటా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ కారులో మృతదేహం కలకలం రేపుతోంది. ఈ డెడ్‌బాడీ ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్‌ సుబ్రమణ్యందిగా గుర్తించారు. నిన్న ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ తనతో పాటు డ్రైవర్‌ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఉదయ్ సమాచారమిచ్చారు. ఇవ్వాల (శుక్రవారం) తెల్లవారుజామున 2గంటలకు తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.

అనంతరం వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్లుగా ఎమ్మెల్సీ వద్ద సుబ్రహ్మణ్యం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్రైవర్‌ను హత్య చేశారంటూ ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి బాధిత‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇది యాక్సిడెంటా.. లేక డ్రైవర్​ని చంపేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement