వరంగల్
అక్రమ అరెస్టులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
నర్సంపేటటౌన్, ఆగస్టు 17 (కెఎన్ఎన్) : తెలంగాణ కోసం పోరాటాలు చేస్తున్న విద్యార్థులను అక్రమంగా అరెస్టులు చేయడం హేయమైన చర్య అని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీజేఏసీ కో-కన్వీనర్ సాంబరాతి మల్లేషం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోం జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 618వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థినిలు బొట్ల నాగలక్ష్మి, రోజా, స్రవంతి, కవిత, అరుణ, మంజుల, ఉర్మిళ, సౌజన్య, ప్రియాంక, హేమలత, రమణి, రాధిక, స్వప్న, మంగదేవి, వసంత, ప్రమీల, సునితలు చేపట్టారు.ఈ దీక్షలను జేఏసీ డివిజన్ కన్వీనర్ అంబటి శ్రీనివాస్, మహిళా కన్వీనర్ గుడిపుడి అరుణారాంచందర్ లు ప్రారంభించారు.అనంతరం శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఓయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ పెడమర్తి రవి, మరో కొంత మంది విద్యార్థులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులను ఆపకపోతే విద్యార్థుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని అన్నారు.ఈ శిబిరాన్ని జేఏసీ నాయకులు కో-ఆర్డీనేటర్ జావిద్, పట్టణ కన్వీనర్ క్రిష్ణారెడ్డి, సాయికుమార్, పవన్, సునిల్, అశోక్, రాజు, చక్రపాణి, జగన్మోహన్ రెడ్డి, లక్ష్మయ్య, నవీన్, రజిత, ప్రభాకర్, ఎల్లేష్, కుమారస్వామి, విజయలక్ష్మి, నహిమ్, మహేష్లు సందర్శించి సంఘీభావం తెలిపారు.
రాశి ఫలాలు






