Srikakulam | ఆదిత్యుని సన్నిధిలో ఇన్ఫోసిస్ సుధా
Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని భారతీయ ప్రఖ్యాత విద్యావేత్త, రచయత్రి,ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సుధా నారాయణ మూర్తి దేవాలయానికి వచ్చి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించి , ఆమెకు స్వామి ప్రసాదాలను, చిత్రపటం అందజేశారు.
